అతడి ఫామ్‌పై సెహ్వాగ్ కామెంట్స్

ముంబై: ఐపీఎల్ టోర్నీలో పంజాబ్ జట్టు కెప్టెన్ మయాంక్ అగర్వాల్ ఫామ్..telugu latest news

Update: 2022-04-08 17:27 GMT

ముంబై: ఐపీఎల్ టోర్నీలో పంజాబ్ జట్టు కెప్టెన్ మయాంక్ అగర్వాల్ ఫామ్ పై మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ ఆందోళన వ్యక్తం చేశాడు. కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఆటపై దృష్టి కేంద్రీకరించలేకపోతున్నాడని పేర్కొన్నాడు. ఇలాంటి సమయంలో తనో జట్టు కెప్టెన్ అన్న విషయం మరచి ఆటపై ఫోకస్ పెట్టాలని సెహ్వాగ్ సూచించాడు. ఎలాంటి ఒత్తిడి లేకుండా స్వేచ్ఛగా బ్యాటింగ్ చేయాలి. వన్డే, టెస్ట్ ఫార్మాట్లలో క్రీజులో కుదురుకునే వరకు నెమ్మదిగా ఆడినా పరవాలేదు. కానీ, టీ20 ఫార్మాట్లో ఆరంభం నుంచే పరుగులు ఎలా రాబట్టాలనే దానిపై ఫోకస్ పెట్టాలన్నాడు. లేకపోతే ఆటలో వెనుకబడిపోతాం. పంజాబ్ జట్టు బౌలింగ్ విభాగం బలంగా కనిపిస్తోంది. వారు ప్రత్యర్థి జట్టును కట్టడి చేయగలరు. అయితే, బ్యాటర్లు మ్యాచ్ ప్రారంభం నుంచే దూకుడుగా ఆడాలని సెహ్వాగ్ చెప్పుకొచ్చాడు. కాగా, మయాంక్ అగర్వాల్ ఈ సీజన్లో మూడు మ్యాచులు ఆడగా వరుసగా 32, 1, 4 పరుగులు మాత్రమే చేయగలిగాడు.

Tags:    

Similar News