గురువారం పోలవరం విలీన మండలాలకు Chandrababu Naidu

Chandrababu Naidu to Visit Polavaram Merged Mandals on July 28| పోలవరం విలీన మండలాలలో గురువారం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు. ఈ మేరకు పార్టీ కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. విలీన మండలాలు గోదావరి ముంపునకు గురయ్యారు

Update: 2022-07-27 11:21 GMT

దిశ, ఏపీ బ్యూరో: Chandrababu Naidu to Visit Polavaram Merged Mandals on July 28| పోలవరం విలీన మండలాలలో గురువారం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు. ఈ మేరకు పార్టీ కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. విలీన మండలాలు గోదావరి ముంపునకు గురయ్యారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా వరద రావడంతో ముంపు గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలో వారికి భరోసా కల్పించడంతోపాటు ఆదుకునేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నేరుగా రంగంలోకి దిగనున్నారు. గోదావరి వరద ప్రభావిత ప్రాంతాల్లో గురు, శుక్రవారాల్లో పర్యటించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా గురువారం ఉదయం 8 గంటలకు ఉండవల్లిలోని నివాసం నుంచి వరద ప్రాంతాల పర్యటనకు చంద్రబాబు బయలుదేరతారు. మొదటి రోజు వేలేరుపాడు, కుక్కునూరు మండలాలలోని శివకాశీపురం, కుక్కునూరులలో పర్యటిస్తారు. ఆ తర్వాత భద్రాద్రి జిల్లా బూర్గంపహాడ్ లో ముంపు ప్రాంతాలకు వెళ్లి వారిని చంద్రబాబు పరామర్శించనున్నారు. అనంతరం రాత్రికి భద్రాద్రిలో చంద్రబాబు బస చేయనున్నారు. ఇక రెండో రోజైన శుక్రవారం ఎటపాక, కూనవరం, విఆర్ పురం మండలాల్లోని తోటపల్లి, కోతులగుట్ట, కూనవరం, రేఖపల్లి ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటిస్తారు.

ఇది కూడా చదవండి: పెళ్లి చేసుకునే వారికి టీటీడీ గుడ్ న్యూస్..

Tags:    

Similar News