బీఎస్పీ బహిరంగ సభ వాల్ పోస్టర్ ఆవిష్కరణ
దిశ, హన్మకొండ టౌన్ : మహనీయుల ఆశయసాధనకు లక్ష్యంగా మాయావతి నేతృత్వంలో బహుజన్ సమాజ్ పార్టీ..
దిశ, హన్మకొండ టౌన్ : మహనీయుల ఆశయసాధనకు లక్ష్యంగా మాయావతి నేతృత్వంలో బహుజన్ సమాజ్ పార్టీ పనిచేస్తుందని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అధ్యక్షులు బానోత్ రవీందర్ నాయక్ అన్నారు. బహుజన్ సమాజ్ పార్టీ అందులో భాగంగానే బహుజన రాజ్యాధికార యాత్ర వంద రోజులు పూర్తయిన సందర్భంగా ఛత్రపతి సాహు మహారాజ్ గారి 148వ జయంతి సందర్భంగా ఆ మహనీయులకు నివాళులర్పిస్తూ హనుమకొండ హయగ్రీవాచారి గ్రౌండ్లో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సభకు సంబంధించిన కరపత్రాన్ని శుక్రవారం మేడ్చల్లో ఆవిష్కరించారు. జిల్లా నుంచి దాదాపు రెండు వేల మంది వరకు ఈ భారీ బహిరంగ సభకు తరలి వెళ్తున్నామని, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మేడ్చల్ జిల్లా నుండి భారీ జన సమీకర జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఈసీ మెంబర్ మల్లేశం, జిల్లా మహిళా కన్వీనర్ లక్ష్మి ఆనంద్, ఉప్పల్ నియోజకవర్గం అధ్యక్షుడు ఎడ్ల పరమేష్, వేముల అనిత జనరల్ సెక్రెటరీ, పోలేపాక ప్రవీణ్ మండల కన్వీనర్ తదితరులు పాల్గొన్నారు.