62 ఏళ్ల పూజారిని కొట్టి చంపిన వ్యక్తి.. కారణమేంటో తెలుసా?

దిశ, వెబ్‌డెస్క్: దేశంలో మత ఘర్షణలు రోజురోజుకు కొత్త మలుపు తీసుకుంటున్నాయి. ఏ రోజు ఏ కారణంగా మత ఘర్షణలు..

Update: 2022-07-07 09:24 GMT

దిశ, వెబ్‌డెస్క్: దేశంలో మత ఘర్షణలు రోజురోజుకు కొత్త మలుపు తీసుకుంటున్నాయి. ఏ రోజు ఏ కారణంగా మత ఘర్షణలు మొదలవుతాయో అర్థం కావడం లేదు. ఇలాంటి సమయంలో ఢిల్లీలో జరిగిన ఓ ఘటన అందరినీ షాక్‌కు గురిచేసింది. 62 ఏళ్ల పూజారిని ఓ వ్యక్తి కొట్టి చంపాడు. ఈ ఘటన ఢిల్లీ సోనియా విహార్ ప్రాంతంలో చోటుచేసుకుంది. ఈ ఘటనలో నిందితుడిని సోను భట్ అనే వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. అతడిని మానసిక ఆరోగ్యం సరిగా లేదని, అందువల్లే పూజారిని హతమార్చాడని పోలీసులు తెలిపారు. అయితే ఘటన జరిగిన అనంతరం అతడిని స్థానికులు చితకబాదారని, ప్రస్తుతం అతడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని పోలీసులు తెలిపారు. ప్రాథమిక విచారణలో అతడి మానసిక అనారోగ్యం గురించి తమకు తెలిసిందని, అతడిని త్వరలోనే మానసిక ఆసుపత్రికి తరలిస్తామని పోలీసులు తెలిపారు. అంతేకాకుండా ఈ ఘటన కేవలం నిందితుడి మానసిక పరిస్థితి కారణంగా జరిగిన ప్రమాదం మాత్రమేనని, ఎటువంటి పాత కక్షలు, పగలు లేవని పోలీసులు వెల్లడించారు.

Similar News