తొక్కిసలాటలో ఎవరు చనిపోలేదు: అడిషనల్ సీపీ చౌహాన్
సికింద్రాబాద్ జింఖానా గ్రౌండ్ వద్ద జరిగిన తొక్కిసలాటలో మహిళ మృతి చెందిందని వస్తున్న వార్తలపై అడిషనల్ సీపీ చౌహాన్
దిశ, వెబ్డెస్క్: సికింద్రాబాద్ జింఖానా గ్రౌండ్ వద్ద జరిగిన తొక్కిసలాటలో మహిళ మృతి చెందిందని వస్తున్న వార్తలపై అడిషనల్ సీపీ చౌహాన్ స్పందించారు. తొక్కిసలాటలో ఎవరు చనిపోలేదని స్పష్టం చేశారు. ఈ తొక్కిసలాటలో సుమారు 20 మంది వరకు స్పృహకొల్పోయారని తెలిపారు. అలాగే తొక్కిసలాటపై సమగ్ర విచారణకు రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తుంది. జింఖానా గ్రౌండ్ వద్ద జరిగిన తొక్కిసలాటలో HCA అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. వారిపై చర్యలకు పోలీసు అధికారులు సిద్దమైనట్లు తెలుస్తోంది.