ఎర్రకోటపై గులాబీ జెండా ఎగురవేస్తాం: CM KCR
ఢిల్లీ ఎర్రకోటపై గులాబీ జెండా ఎగురవేస్తామని సీఎం కేసీఆర్ అన్నారు.
దిశ, వెబ్ డెస్క్: ఢిల్లీ ఎర్రకోటపై గులాబీ జెండా ఎగురవేస్తామని సీఎం కేసీఆర్ అన్నారు. శుక్రవారం తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ జెండా ఆవిష్కరణ అనంతరం కుమారస్వామి, ప్రకాష్ రాజ్ ఇతర కీలక నేతలతో సీఎం కేసీఆర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కేసీఆర్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. రైతు పాలసీ, జల విధానాన్ని త్వరలో రూపొందిస్తామన్నారు. ఈనెల 14న ఢిల్లీలో బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ ప్రారంభించనున్నట్లు కేసీఆర్ తెలిపారు. కర్ణాటక ఎన్నికల్లో జేడీఎస్ తరపున ప్రచారం చేస్తామని సీఎం స్పష్టం చేశారు. రాబోయేది రైతు ప్రభుత్వమే అని తెలిపారు. త్వరలో పార్టీ విధి విధానాలను రూపొందిస్తామన్నారు. కుమారస్వామి కర్ణాటక సీఎం కావాలని కాంక్షించారు.
Also Read....