గుడుంబా స్థావరాలపై పోలీసుల దాడి..

బయ్యారం ఎస్ఐ మౌలానా తన సిబ్బందితో కలిసి సోమవారం

Update: 2024-04-15 16:08 GMT

దిశ,బయ్యారం : బయ్యారం ఎస్ఐ మౌలానా తన సిబ్బందితో కలిసి సోమవారం పత్య తండాలో ఎక్సైజ్ రైడ్ చేశారు. 200 లీటర్ల బెల్లం పానకం 10 లీటర్ల నాటుసారా స్వాధీన పరచుకొని నాటుసారా కాస్తున్న ఇస్లావత్ భాస్కర్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ గ్రామాల్లో బెల్లం రవాణా చేయకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటామని,అదే విధంగా గుడుంబా కాసే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని నాటు సారా కాసే వారిపై పిడి యాక్ట్ అమలు చేస్తామని అన్నారు. ఈ దాడుల్లో ఎస్ఐ తో పాటు ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొని గ్రామంలో గుడుంబా నివారణపై ప్రజలకు అవగాహన కల్పించారు.

Similar News