మైక్రోబయాలజీ వింగ్ లో పీహెచ్‌డీ..

కాకతీయ యూనివర్శిటీ మైక్రోబయాలజీ విభాగంలో రీసెర్చ్ స్కాలర్ నల్లపు శ్రీనివాసరావుకు పీహెచ్‌డీ ప్రకటించారు.

Update: 2023-04-09 09:58 GMT

దిశ, కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్శిటీ మైక్రోబయాలజీ విభాగంలో రీసెర్చ్ స్కాలర్ నల్లపు శ్రీనివాసరావుకు పీహెచ్‌డీ ప్రకటించారు. ‘గర్భిణులలో మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ బ్యాక్టీరియా, అల్టర్నేటివ్ థేరాపీస్ ఫర్ యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ ’ అనే అంశంపై అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ముంజమ్ శ్రీనివాస్ పర్యవేక్షణలో పరిశోధన చేసినట్లు తెలిపారు. ఎన్ శ్రీనివాసరావు స్వస్థలం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలానికి చెందిన ఆసుపాక గ్రామం. ప్రస్తుతం శ్రీనివాసరావు హన్మకొండ ప్రశాంతి హాస్పిటల్ లో ఎంబ్రియాలజిస్ట్‌గా పనిచేస్తున్నారు.

Tags:    

Similar News