కడియం కావ్య తన కులాన్ని, మతాన్ని నిరూపించుకోవాలి

ముస్లింల మతాచారం ప్రకారం పెళ్లి చేసుకున్న కడియం కావ్య బైండ్ల కులం పేరుతో రిజర్వేషన్ పొంది పోటీ చేస్తుందని, ఆమె తన కులాన్ని మతాన్ని నిరూపించుకోవాలని మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య అన్నారు.

Update: 2024-05-04 10:54 GMT

దిశ, లింగాల ఘణపురం : ముస్లింల మతాచారం ప్రకారం పెళ్లి చేసుకున్న కడియం కావ్య బైండ్ల కులం పేరుతో రిజర్వేషన్ పొంది పోటీ చేస్తుందని, ఆమె తన కులాన్ని మతాన్ని నిరూపించుకోవాలని మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య అన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం మండలంలోని చీటూరు, కిష్టగూడెం, కుందారం, పటేల్ గూడెం, నవాబుపేట, వడిచర్ల, కొత్తపల్లి, వనపర్తి నేలపోగు, నెల్లుట్ల గ్రామాలలో ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల

    సమావేశంలో ఆయన మాట్లాడుతూ కడియం కావ్య దొంగ సర్టిఫికెట్లతో రిజర్వేషన్ పొందిందని, తన కూతురు పేరు కూడా మెహంది నజీర్ కడియం గా పెట్టుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. కడియం శ్రీహరి అఖిలపక్షం ఏర్పాటుచేసి తన కులాన్ని నిరూపించుకోవాలని సీఎం చెప్పారని గుర్తు చేశారు. 60 ఏళ్లుగా అక్రమంగా ఎస్సీ రిజర్వేషన్లు అనుభవిస్తున్న కడియం శ్రీహరికి బుద్ధి చెప్పాలంటే, దళితులు ముందు వరుసలో ఉండి కావ్యను ఓడించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీ అభ్యర్థి సుధీర్ కుమార్, ఎంపీపీ చిట్లా జయశ్రీ ఉపేందర్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు శ్రీనివాస్, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షురాలు గండి మంగమ్మ యాదగిరి, ఎంపీటీసీ గోలి రాజు, నాయకులు దయ్యాల గణేష్, రేపు శ్రీశైలం, భాగ్యలక్ష్మి, జోగు పరశురాములు, సోమిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Similar News