గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే భూ బాధిత రైతులు ధర్నా..

హనుమకొండ జిల్లా దామర మండలం ఊరుగొండ వద్ద జాతీయ

Update: 2024-04-25 12:55 GMT

దిశ,హనుమకొండ టౌన్ : హనుమకొండ జిల్లా దామర మండలం ఊరుగొండ వద్ద జాతీయ రహదారిపై గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే భూ బాధిత రైతులు ధర్నా రాస్తారోకో చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. జాతీయ రహదారిపై ఆందోళన చేపట్టడంతో కిలోమీటర్ల మేర వాహనాలు ఆగిపోయాయి సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఆందోళన చేస్తున్న భూ నిర్వాసితులను అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ కు తరలించారు. పచ్చని పంట పొలాలను గ్రీన్ ఫీల్డ్ హైవే కోసం ఇచ్చేది లేదంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Similar News