రైతు బంధు ఎఫెక్ట్.. సొంత ఇలాకాలో మంత్రి సీతక్కకు నిరసన సెగ..!
రైతు బంధు ఎఫెక్ట్తో మంత్రి సీతక్కకు సొంత ఇలాకాలో నిరసన సెగ తగిలింది.
దిశ, వెబ్డెస్క్: రైతు బంధు ఎఫెక్ట్తో మంత్రి సీతక్కకు సొంత ఇలాకాలో నిరసన సెగ తగిలింది. ఇప్పటివరకు రైతుబంధు రాలేదని మంత్రి సీతక్కను రైతులు నిలదీశారు. తన సొంత నియోజకవర్గమైన ములుగు జిల్లాకు చెందిన రైతులను సీతక్క శుక్రవారం కలిశారు. ఈ సందర్భంగా రైతులు తమ బాధలు చెబుతూ వాపోయారు. ఇప్పటివరకు రైతుబంధు రాలేదని సీతక్కను ముఖం పట్టుకుని నిలదీశారు. మూడెకరాల భూమి ఇస్తానన్నవన్ని వట్టి మాటలేనని, ఇంతవరకు ఒక్కరికైనా ఇచ్చారా అని ప్రశ్నించారు. రైతుల ప్రశ్నలకు రియాక్ట్ అయిన సీతక్క.. త్వరలోనే రైతుబంధు రానివాళ్లందరికి వస్తదని, కొంతసమయం పడుతుందని రిప్లై ఇచ్చారు. ఏమైనా ప్రాబ్లమ్ ఉందేమోనని చూసి కాంగ్రెస్ తప్పకుండా రైతుబంధు అందజేస్తుందని చెప్పుకొచ్చారు.