రేపు బీజేపీ జిల్లా కార్యాలయాలు ప్రారంభం
వరంగల్, జనగామ, భూపాలపల్లి, మహబూబాబాద్ జిల్లాల పార్టీ కార్యాలయాలను శుక్రవారం బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వర్చువల్ విధానంలో ప్రారంభించనున్నారు.
దిశ, వరంగల్ బ్యూరో : వరంగల్, జనగామ, భూపాలపల్లి, మహబూబాబాద్ జిల్లాల పార్టీ కార్యాలయాలను శుక్రవారం బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వర్చువల్ విధానంలో ప్రారంభించనున్నారు. ఇటీవల నాలుగు జిల్లాల్లో శాశ్వత భవనాల నిర్మాణాలు పూర్తి కావడంతో జిల్లా కార్యాలయాల ప్రారంభోత్సవాన్ని శుక్రవారం చేపట్టనున్నారు. సంగారెడ్డిలో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన అనంతరం నడ్డా వర్చువల్ విధానంలో వరంగల్, జనగామ, భూపాలపల్లి, మహబూబాబాద్ జిల్లాల పార్టీ కార్యాలయాలను ప్రారంభిస్తారని బీజేపీ నేతలు తెలిపారు.