ఇప్పటి వరకు ఒక్క అవినీతి మచ్చ లేదు.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు

పదేండ్లలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు రూ.10 లక్షల కోట్లు కేటాయించిందన్నారు.

Update: 2024-04-18 08:55 GMT

దిశ, వెబ్‌డెస్క్ : పదేండ్లలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు రూ.10 లక్షల కోట్లు కేటాయించిందన్నారు. ప్రగతి నివేదిక కార్యక్రమంలో భాగంగా కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. బీజేపీ పార్టీ లేకపోతే తాను లేనన్నారు. తనపై ఇప్పటి వరకు ఒక్క అవినీతి మచ్చ లేదని గుర్తు చేశారు. ఒక బిల్డర్, ఒక కాంట్రాక్టర్ అనేది నాకు ఇప్పటి వరకు తెలియదన్నారు. ఇప్పటి వరకు తాను బిల్డర్, కాంట్రాక్టర్లను బెదిరించలేదన్నారు. ఎప్పుడూ ఎవరిపై పక్షపాత ధోరణితో వ్యవహరించలేదని స్పష్టం చేశారు. తనపై కొందరు వ్యక్తులు చెప్పలేని భాషలో విమర్శలు చేశారని తెలిపారు. అలాంటి వారికి ప్రజలు గతంలో బుద్ధి చెప్పారన్నారు. రాబోయే రోజుల్లో బుద్ధి చెబుతారని తెలిపారు. తాను పని చేశాను అని భావిస్తేనే తనకు ఓటు వేయాలని కోరారు. లేదంటే ఓటు వేయకండని తేల్చి చెప్పారు. తనను గెలిపిస్తే మళ్ళీ మీకు సేవ చేసుకుంటా అన్నారు. 

Similar News