రామనవమి రోజున శోభయాత్ర తీస్తే చంపేస్తాం.. రాజాసింగ్‌కు బెదిరింపు కాల్

గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు బెదిరింపు కాల్ రావడం కలకలం రేపుతోంది. రామనవమి రోజున శోభయాత్ర తీస్తే చంపేస్తామని కొందరు ఫోన్‌లు చేసి బెదిరింపులకు పాల్పడుతున్నారని స్వయంగా వీడియో విడుదల చేసి రాజాసింగ్ వెల్లడించారు.

Update: 2024-01-14 07:41 GMT

దిశ, వెబ్‌డెస్క్: గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు బెదిరింపు కాల్ రావడం కలకలం రేపుతోంది. రామనవమి రోజున శోభయాత్ర తీస్తే చంపేస్తామని కొందరు ఫోన్‌లు చేసి బెదిరింపులకు పాల్పడుతున్నారని స్వయంగా వీడియో విడుదల చేసి రాజాసింగ్ వెల్లడించారు. ఫోన్‌లు చేసి బెదిరించడం కాదని.. దమ్ముంటే నేరుగా రావాలని రాజాసింగ్ చాలెంజ్ చేశారు. గతంలోనూ ఇదే తరహాలో బెదిరింపు కాల్స్ వచ్చాయని తెలిపారు. నమ్మిన సిద్ధాంతం కోసం తాను ఎంతదూరమైనా వెళ్తానని చెప్పారు. ఇలాంటి బెదిరింపులు తనను ఏం చేయలేవని అన్నారు. బెదిరింపులకు పాల్పడే వారు ఎంత స్థాయి వ్యక్తులైనా తనకు అనవసరమని.. దమ్ముంటే నేరుగా రావాలని.. లేకుంటే ఫోన్‌లు చేయడం మానుకోవాలని హితవు పలికారు.

Tags:    

Similar News