బ్రేకింగ్: మెగాస్టార్ చిరంజీవికి నోటీసులు జారీ చేసిన తెలంగాణ హైకోర్టు

Update: 2023-03-14 16:45 GMT

దిశ, వెబ్‌డెస్క్: మెగాస్టార్ చిరంజీవికి తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ప్రజల అవసరాల కోసం కేటాయించిన స్థలాన్ని చిరంజీవికి విక్రయించారన్న పిటిషన్‌పై ఇవాళ తెలంగాణలో హైకోర్టులో విచారణ జరిగింది. జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీలో ఎలాంటి నిర్మాణం చేపట్టవద్దంటూ చిరంజీవిని ఈ సందర్భంగా హైకోర్టు ఆదేశించింది. నిర్మాణంపై స్టే కొనసాగించాలని చిరంజీవికి, సొసైటీకి కోర్టు సూచించింది. ఈ పిటిషన్‌కు కౌంటర్ దాఖలు చేయాలని చిరంజీవిని, సొసైటీని కోర్టు ఆదేశించింది. ఈ కేసు తదుపరి విచారణను ఏప్రిల్ 25వ తేదీకి తెలంగాణ హైకోర్టు వాయిదా వేసింది. 

Tags:    

Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !


Similar News