కొందరు రాజకీయ నాయకులు అర్థం చేసుకోలేరు.. మన్నె క్రిశాంక్ ఆసక్తికర ట్వీట్
కొందరు రాజకీయ నాయకులు కేసీఆర్ గారు పెంచిన ఆస్తులను అర్థం చేసుకోలేరు అని బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిశాంక్ అన్నారు
దిశ, డైనమిక్ బ్యూరో: కొందరు రాజకీయ నాయకులు కేసీఆర్ గారు పెంచిన ఆస్తులను అర్థం చేసుకోలేరు అని బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిశాంక్ అన్నారు. యాదాద్రి ఆలయం నుంచి వచ్చే ఆదాయంపై ట్విట్టర్ వేదికగా స్పందించిన ఆయన ఈ తరహా వ్యాఖ్యలు చేశారు. యాదాద్రి ఆలయానికి గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం ఆదాయం బాగా పెరిగిందని, మునుపెన్నడు లేని విధంగా రికార్డు స్థాయిలో 2023-24 సంవత్సరం 225 కోట్ల ఆదాయం వచ్చిందని, గత సంవత్సరం కంటే 55 కోట్ల ఆదాయం ఎక్కువగా పెరిగిందని రాసిన ఓ వార్తా పేపర్ కు సంబందించిన క్లిప్ ను ట్విట్టర్ లో పోస్టు చేశారు. దీనికి కొందరు రాజకీయ నాయకులకు కేసీఆర్ గారు పెంచిన ఆస్తులను అర్థం చేసుకోలేరు అని రాసుకొచ్చారు.
Some politicians can never understand KCR garu’s Asset Building …. pic.twitter.com/Y8d2L7eaFj
— Krishank (@Krishank_BRS) April 16, 2024