HYD: ఉరిశిక్ష విధిస్తూ నాంపల్లి కోర్టు సంచలన తీర్పు

హైదరాబాద్‌లోని నాంపల్లి కోర్టు హత్య కేసులో నిందితుడికి ఉరి శిక్ష విధిస్తూ సంచలన తీర్పు వెలువరించింది.

Update: 2024-01-18 15:39 GMT

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లోని నాంపల్లి క్రిమినల్ కోర్టు హత్య కేసులో నిందితుడికి ఉరి శిక్ష విధిస్తూ సంచలన తీర్పు వెలువరించింది. 2019లో భార్యను భర్త ఇమ్రాన్ కిరాతకంగా హత్య చేశాడు. ఈ ఘటన భవానీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఈ కేసులో పోలీసుల తరపున అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ శ్రావణి వాదనలు వినిపించింది. సుదీర్ఘకాలం పాటు వాదోపవాదాలు విన్న నాంపల్లిలోని జిల్లా మేజిస్ట్రేట్ కోర్టు న్యాయాధికారి సాయి భూపతి ఇమ్రాన్‌కు ఉరి శిక్ష విధిస్తూ తీర్పునిచ్చారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Tags:    

Similar News