Rythu Bandhu scheme : రైతుబంధు మూడో రోజు.. రైతుల ఖాతాలో రూ.1325.24 కోట్లు జమ

మూడో రోజు రైతుబంధు రూ.1325.24 కోట్లు 10.89 లక్షల రైతుల ఖాతాలలో ప్రభుత్వం బుధవారం జమ చేసింది.

Update: 2023-06-28 06:44 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: మూడో రోజు రైతుబంధు రూ.1325.24 కోట్లు 10.89 లక్షల రైతుల ఖాతాలలో ప్రభుత్వం బుధవారం జమ చేసింది. 3 ఎకరాలు ఉన్న రైతుల ఖాతాలో రైతు బంధు జామచేసింది.ఇప్పటి వరకు 50.43 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.3246.42 కోట్లు జమ చేసింది.రైతుల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్రంలో పథకాల అమలు, వ్యవసాయం, రైతు బాగుంటేనే సమాజం బాగుంటుందని,అందుకే జనాభాలో అధిక శాతం ఆధారపడిన వ్యవసాయరంగం బలోపేతానికి ముఖ్యమంత్రి కేసీఆర్ చేయూతనిస్తున్నారని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలిపారు.

Tags:    

Similar News