సర్కార్ దవాఖానాలో మెరుగైన వైద్యం.. జెడ్పీటీసీ మంజుల

సర్కార్ దవాఖానాలో మెరుగైన వైద్యం అందిస్తున్నారని జడ్పీటీసీ మంజుల అన్నారు.

Update: 2022-12-06 11:34 GMT

దిశ, తాండూరు రూరల్: సర్కార్ దవాఖానాలో మెరుగైన వైద్యం అందిస్తున్నారని జడ్పీటీసీ మంజుల అన్నారు. మంగళవారం మండలంలెపి జింగుర్తి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో NCD మందుల కిట్లను జడ్పీటీసీ మంజుల, వైస్ ఎంపీపీ స్వరూపరెడ్డి పంపిణీ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ప్రైవేటు ఆసుపత్రిలకు ధీటుగా ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సదుపాయాలు ఉన్నాయని అన్నారు. ప్రవైట్ హాస్పిటల్ కు వెళ్లి అనవసరంగా అప్పుల పాలు కావొద్దని ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారి అపూర్వ రెడ్డి, చెంగోల్ మాజీ ఎంపీటీసీ, గౌడి వెంకటేశం, ఉప సర్పంచ్ అసిమ్, పిహెచ్ సి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Similar News