బీసీలకు అధికారం, ఆత్మగౌరవం కాంగ్రెస్ తోనే సాధ్యం : రంజిత్ రెడ్డి
బీజేపీ పార్టీని నమ్ముకుంటే బీసీలకు బూడిదే మిగులుతుందని చేవెళ్ల కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి డాక్టర్ జి.రంజిత్ రెడ్డి పేర్కొన్నారు.
దిశ ,ప్రతినిధి వికారాబాద్: బీజేపీ పార్టీని నమ్ముకుంటే బీసీలకు బూడిదే మిగులుతుందని చేవెళ్ల కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి డాక్టర్ జి.రంజిత్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం వికారాబాద్ పట్ణణ కేంద్రంలోని గౌలికర్ ఫంక్షన్ హాల్ లో బీసీ సంఘాల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి బీసీ సంఘం అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్, స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తదితర నాయకులతో కలిసి రంజిత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ జాతీయ మేనిఫెస్టోలో కనీసం బీసీల ప్రస్తావనే లేదని ఆయన గుర్తు చేశారు. బడుగు బలహీనవర్గాలకు కాంగ్రెస్ పార్టీయే అభయాస్తమని చెప్పారు.
బీసీలకు అవకాశం, అధికారం, ఆత్మగౌరవం కాంగ్రెస్ తోనే సాధ్యమన్నారు. బీసీల పాలిట బీజేపీ ది భస్మాసుర హస్తమైతే, కాంగ్రెస్ ది అభయహస్తం అన్నారు. పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టి చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలన్న డిమాండ్ ను కాంగ్రెస్ పార్టీ నేరవేరుస్తుందని హామీనిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ బీసీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.