చేవెళ్ల పార్లమెంట్ ప్రజలు కొండా వైపే ఉన్నారు : కొండా సంగీతా రెడ్డి

చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గం ప్రజలు బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి వైపే ఉన్నారని కొండా విశ్వేశ్వర్ రెడ్డి సతీమణి కొండా సంగీతా రెడ్డి అన్నారు.

Update: 2024-05-06 11:31 GMT

దిశ, మహేశ్వరం: చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గం ప్రజలు బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి వైపే ఉన్నారని కొండా విశ్వేశ్వర్ రెడ్డి సతీమణి కొండా సంగీతా రెడ్డి అన్నారు. సోమవారం మహేశ్వరం మండలంలోని అమీర్ పేట్, మాణిక్యమ్మ గూడ, కేకే బస్తి, సుభాన్ పూర్ గ్రామాలలో ఇంటింటి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా కొండా సంగీతారెడ్డి మాట్లాడుతూ... దేశ ప్రజలంతా నరేంద్ర మోడీని మరోసారి ప్రధాని చేయడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. నరేంద్ర మోడీ నాయకత్వంలో బీజేపీపార్టీ ఘన విజయం సాధిస్తుందన్నారు. చేవెళ్ల పార్లమెంట్ ప్రజలు విశ్వేశ్వర్ రెడ్డి నాయకత్వాన్ని కోరుకుంటున్నారన్నారు. విశ్వేశ్వర్ రెడ్డి పై ఎటువంటి అవినీతి మచ్చ లేదన్నారు.మే 13 న జరుగనున్న పోలింగ్ లో ప్రజలంతా స్వచ్ఛందంగా పాల్గొన్ని విశ్వేశ్వర్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు పాపయ్య గౌడ్, మిద్దె సుదర్శన్ రెడ్డి, అందెల శ్రీరాములు యాదవ్ ,ముయ్యడా శివ ,పంతు నాయక్, మహేందర్ ముదిరాజ్ ,పాండు ,బిజేపి,బిజెవైఎం నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Similar News