Minister KTR :మినిస్టర్ కేటీఆర్ ను కలిసిన ఎమ్మెల్సీ

మంత్రి కేటీఆర్ ను మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు.

Update: 2022-12-01 10:59 GMT

దిశ, తలకొండపల్లి : మంత్రి కేటీఆర్ ను మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. కల్వకుర్తి నియోజకవర్గంలోని ఆయా గ్రామాలలో రోడ్లన్నీ ఇటీవల కురిసిన భారీ వర్షాలకు చాలావరకు ధ్వంసం అయ్యాయని మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లినట్లు ఎమ్మెల్సీ తెలిపారు. మంత్రి కేటీఆర్ వెంటనే స్పందించి రోడ్ల పునరుద్ధరణకు నిధులు మంజూరు చేయాలని గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకు ఆదేశాలు జారీ చేసినట్లు పేర్కొన్నారు.

సానుకూలంగా స్పందించిన మంత్రి ఎర్రవెల్లి దయాకర్ రావు నియోజకవర్గంలోని తలకొండపల్లి నుండి వీరన్నపల్లి, వెల్దండ నుండి తిమ్మినోని పల్లి, బైరాపూర్ నుండి అజిలాపూర్ వరకు రోడ్ల పునరుద్ధరణకు నిధులు మంజూరు చేయనున్నట్లు కసిరెడ్డి నారాయణరెడ్డి పేర్కొన్నారు. నిధుల మంజూరు కాగానే రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభిస్తారని పేర్కొన్నారు. నిధుల మంజూరుకు సహకరించిన మంత్రి కేటీఆర్ ఎర్రబెల్లిలకు ఎమ్మెల్సీ నారాయణ రెడ్డి నియోజకవర్గ ప్రజల తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

Tags:    

Similar News