చేవెళ్లలో కాషాయ జెండా ఎగరాలి

మైలార్ దేవ్ పల్లి డివిజన్ పరిధిలోని వివిధ ప్రాంతాల్లో ఆదివారం చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి, రాజేంద్ర నగర్ నియోజకవర్గ కాంటెస్టెడ్ ఎమ్మెల్యే అభ్యర్థి, స్థానిక కార్పొరేటర్ తోకల శ్రీనివాస్ రెడ్డి బైక్ ర్యాలీ నిర్వహించారు.

Update: 2024-04-28 13:06 GMT

దిశ, రాజేంద్రనగర్ : మైలార్ దేవ్ పల్లి డివిజన్ పరిధిలోని వివిధ ప్రాంతాల్లో ఆదివారం చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి, రాజేంద్ర నగర్ నియోజకవర్గ కాంటెస్టెడ్ ఎమ్మెల్యే అభ్యర్థి, స్థానిక కార్పొరేటర్ తోకల శ్రీనివాస్ రెడ్డి బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పేదల సంక్షేమం కోసం ఎన్నో పథకాలు అమలు చేశారని తెలిపారు.

    కొండా విశ్వేశ్వర్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని తోకల శ్రీనివాస్ రెడ్డి పిలుపునిచ్చారు. చేవెళ్ల పార్లమెంటు ప్రజల కోసం ఆయన ఎంతోకాలంగా నిస్వార్ధంగా పనిచేస్తున్నారని కొనియాడారు. ఆయనను గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. చేవెళ్ల లో కాషాయ జెండా ఎగరాలన్నారు.

Similar News