గంజాయి తరలిస్తున్న నలుగురు వ్యక్తులు అరెస్టు రిమాండ్
గంజాయి తరలిస్తున్న నలుగురిని అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. పరిగి డీఎస్పీ కరుణా సాగర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం పరిగి కి చెందిన సయ్యద్ ఉజాయిఫ్,
దిశ, పరిగి : గంజాయి తరలిస్తున్న నలుగురిని అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. పరిగి డీఎస్పీ కరుణా సాగర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం పరిగి కి చెందిన సయ్యద్ ఉజాయిఫ్, సయ్యద్ మల్కాపూర్ గ్రామానికి చెందిన వడ్ల సాయిరాం చారి, సొండేపూర్ గ్రామాని చెందిన పాల్త్యా సతీష్, పెద్ద మాదారం గ్రామానికి చెందిన కొతిలి ప్రశాంత్ సోమవారం సాయంత్రం పరిగి కోడంగల్ చౌరస్తా వద్ద కారులో గంజాయి తరలిస్తున్న పోలీసులు సమాచారం తెలుసుకున్నారు. వారిని అదుపులోకి తీసుకొని వారి వద్ద 207 గ్రాముల గంజాయిని తరలిస్తున్నట్లు ఒప్పుకున్నారు. నిందితులను అరెస్టు చేసి రిమాండుకు తరలించినట్లు డీఎస్పీ కరుణా సాగర్ రెడ్డి తెలిపారు. సీఐ శ్రీనివాస్,ఎస్ఐ సంతోష్ కుమార్ లు ఉన్నారు.