చేవెళ్ల ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలి : ప్రసాద్ కుమార్

పార్టీలతో సంబంధం లేకుండా పిలిస్తే పలికే మంచి మనసున్న గొప్ప నాయకుడు గడ్డం రంజిత్ రెడ్డి ని భారీ మెజారిటీ తో గెలిపించాలని శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు

Update: 2024-04-27 14:03 GMT

దిశ, బంట్వారం ; పార్టీలతో సంబంధం లేకుండా పిలిస్తే పలికే మంచి మనసున్న గొప్ప నాయకుడు గడ్డం రంజిత్ రెడ్డి ని భారీ మెజారిటీ తో గెలిపించాలని శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్య అతిథిగా శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ మాట్లాడుతూ… చేవెళ్ల ప్రాంతాన్ని అభివృద్ధి పథంలో నడిపే నాయకుడు రంజిత్ రెడ్డి అని స్పీకర్ అన్నారు.ఇలాంటి గొప్ప వ్యక్తిని గెలిపించడం కోసం నాయకులు ,కార్యకర్తలు కృషి చేయాలని అన్నారు.

రంజిత్ రెడ్డి నాటి సీఎం కేసీఆర్ చెప్పినట్లు పార్టీ కోసం కట్టుబడి పని చేశారు తప్ప నన్ను ఓడించడానికి నాపై కోపం తో కాదని అన్నారు. ఏది ఏమైనా నాపై నమ్మకంతో నన్ను గెలిపించారన్నారు. రంజిత్ రెడ్డి మాట్లాడుతూ... చేవెళ్ల ఎంపీ గా తమను గెలిపించండి చేవెళ్ల ప్రాంతాన్ని మరింతగా అభివృద్ధి చేసి చూపిస్తా అని రంజిత్ రెడ్డి అన్నారు. తమను గెలిపించడం కోసం నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలన్నారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ బంట్వారం మండల అధ్యక్షులు పోచారం వెంకటేశం,ఎంపీపీ ప్రభాకర్, జెడ్పీటీసీ సంతోష రాజు, ఎస్సీ సెల్ చేవెళ్ల పార్లమెంట్ ఇన్చార్జి కోట పల్లి రాజు, తెలంగాణ యూత్ కాంగ్రెస్ స్టేట్ సెక్రటరీ హరిశ్వర్ రెడ్డి, సీనియర్ నాయకులు మొగుళయ్య, నర్సింలు, శివకుమార్, మాజీ సర్పంచ్ లు లావణ్య శ్రీనివాస్, నరసింహా రెడ్డి , బర్కత్ పల్లి నర్సింలు, కాంగ్రెస్ యువ నాయకులు దొరేటీ సుధాకర్, నాయకులు, కార్యకర్తలు,ప్రజలు పాల్గొన్నారు.

Similar News