గంజాయి విక్రేత అరెస్ట్

గంజాయిని విక్రయించడానికి ప్యాకెట్లలో నింపుతున్న ఓ వ్యక్తి ని పహాడి షరీఫ్ పోలీసులు అదుపులోకి

Update: 2023-03-20 16:06 GMT

దిశ, బడంగ్ పేట్ : గంజాయిని విక్రయించడానికి ప్యాకెట్లలో నింపుతున్న ఓ వ్యక్తి ని పహాడి షరీఫ్ పోలీసులు అదుపులోకి తీసుకొని సోమవారం రిమాండ్ కు తరలించారు. పహాడి షరీఫ్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాలాపూర్ మండలం మల్లాపూర్ కు చెందిన విజయ్ జైస్వాల్ అలియాస్ కల్లు అలియాస్ ఖురేషి (36) ఇంట్లో గంజాయిని చిన్న ప్యాకెట్ లలో నింపుతున్నాడన్న విశ్వసనీయ సమాచారం మేరకు పహాడి షరీఫ్ పోలీసులు దాడులు నిర్వహించారు. విజయ్ జైస్వాల్ ను రెడ్ హ్యాండెడ్ గా అదుపులోకి తీసుకొని, అతని వద్ద నుంచి 250 గ్రాముల గంజాయి తో పాటు రూ.500 నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసును పహాడి షరీఫ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Similar News