వచ్చే ఎన్నికల్లో పొత్తుకు సిద్ధం: ప్రొ. కోదండరాం సంచలన ప్రకటన

తెలంగాణ జనసమితి అధ్యక్షుడు, ప్రొఫెసర్ కోదండరాం సంచలన వ్యాఖ్యలు చేశారు.

Update: 2023-06-04 08:40 GMT

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ జనసమితి అధ్యక్షుడు, ప్రొఫెసర్ కోదండరాం సంచలన వ్యాఖ్యలు చేశారు. సూర్యాపేటలో జరుగుతోన్న తెలంగాణ జనసమితి మూడవ ప్లీనరీ సమావేశాల్లో పాల్గొన్న ఆయన టీజేఎస్ జెండా ఎగురవేశారు. అనంతరం కోదండరాం మాట్లాడుతూ.. ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా తెలంగాణ ప్రభుత్వం వ్యవహరిస్తోందని మండిపడ్డారు. కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిపక్షాలు కలిసి పని చేయాలని ఆయన సూచించారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీతోనైనా పొత్తుకు సిద్ధమని ప్రకటించారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నేరవేర్చేందుకు ఏ నిర్ణయానికైనా రెడీ అని ప్రకటించారు. ఎన్నికలు సమీపిస్తోన్న వేళ పొత్తులపై కోదండరాం కీలక వ్యాఖ్యలు చేయడం రాజకీయవర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. 

Read more:

బిగ్ బ్రేకింగ్ న్యూస్: తెలంగాణలో బీజేపీని మట్టి కరిపిస్తాం...ఎన్నికల అనంతరం చూద్దామన్న రాష్ట్రంలో బీజేపీ కనిపించదు....అమెరికా టూర్‌లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ సంచలన వ్యాఖ్యలు

Tags:    

Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !


Similar News