గవర్నర్ ను కలిసిన పొంగులేటి.. ఆహ్వానం అందజేత

రాజ్ భవన్ లో గవర్నర్ తమిళసై‌ను మంత్రి పోంగులేటి శ్రీనివాస్ రెడ్డి కుటంబసమేతంగా వెళ్లి కలిశారు

Update: 2024-02-02 10:55 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: రాజ్ భవన్ లో గవర్నర్ తమిళసై‌ను మంత్రి పోంగులేటి శ్రీనివాస్ రెడ్డి కుటంబసమేతంగా వెళ్లి కలిశారు. ఈ సందర్భంగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గవర్నర్ కి పుష్పగుచ్ఛం ఇచ్చి సత్కరించారు. అలాగే తన సోదరుడు పొంగులేటి ప్రసాద్ రెడ్డి కుమారుడు లోహిత్ రెడ్డి వివాహానికి సంబందించిన ఆహ్వానపత్రిక అందజేశారు. వివాహానికి తప్పక హాజరు కావాలని పొంగులేటి గవర్నర్ ని కోరారు. అనంతరం మంత్రి కాసేపు గవర్నర్ తో కూర్చోని వివిధ అంశాలపై చర్చించినట్లు తెలిసింది.

Tags:    

Similar News