తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు చెప్పిన పవన్ కల్యాణ్

తెలంగాణ స్వరాష్ట్రంగా ఏర్పడి తొమ్మిదేళ్లు పూర్తి చేసుకొని పదో సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా దేశ వ్యాప్తంగా ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

Update: 2023-06-02 03:42 GMT

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ స్వరాష్ట్రంగా ఏర్పడి తొమ్మిదేళ్లు పూర్తి చేసుకొని పదో సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా దేశ వ్యాప్తంగా ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. తాజాగా.. జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు విషెస్ చెప్పారు. ‘తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. నేటి నుంచి 22వ తేదీ వరకు సాగే ఈ దశాబ్ది ఉత్సవాలు చారిత్రాత్మకమైనవి. ఎందరో పోరాట యోధుల పాత్ర త్యాగ ఫలితమే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం. అటువంటి త్యాగధనులందరికీ నివాళులు అర్పిస్తున్నాను. పేదరికం లేని తెలంగాణ ఆవిష్కృతం కావాలని, రైతులు, కర్షకులు, కార్మికులతో పాటు ఈ నేలపై జీవిస్తున్న ప్రతి ఒక్కరూ ఆనందకరమైన జీవితం సాగించాలని కాంక్షాస్తూ.. తెలంగాణ ఖ్యాతి, కీర్తి అజరామరంగా భాసిల్లాలని కోరుకుంటున్నాను’ అని పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు.

Tags:    

Similar News