సెలూన్ షాప్‌కి వెళ్తున్నానని చెప్పి.. ఎంతకీ తిరిగిరాలేదు!

తాడ్వాయిలో ఓ వ్యక్తి అదృశ్యమైన ఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసులు గురువారం మిస్సింగ్ కేసును నమోదు చేశామన్నారు.

Update: 2023-05-26 04:19 GMT

దిశ, తాడ్వాయి : తాడ్వాయిలో ఓ వ్యక్తి అదృశ్యమైన ఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసులు గురువారం మిస్సింగ్ కేసును నమోదు చేశామన్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని కన్కల్ గ్రామానికి చెందిన మంగలి స్వామి 23 భార్య భర్తల మధ్య గొడవ జరగడంతో భార్య సంధ్య పుట్టింటికి వెళ్లిపోయింది. అదే రోజున దేవునిపల్లి లో మంగలి షాప్ కి వెళ్తున్నానని ఇంట్లో చెప్పి వెళ్లాడని, రాత్రి అయినా తిరిగి ఇంటికి రాకపోవడంతో ఫోన్ చేస్తే ఎంతకు కలువ పొగా స్విచ్ ఆఫ్ వస్తుంది. తప్పిపోయిన స్వామి ఇంటి నుండి వెళ్ళినప్పుడు ఎరుపు రంగు చొక్కా, జీన్స్ పాయింట్ ధరించాడని చామన చాయా రంగులో ఉంటాడని తెలుగు భాష మాట్లాడుతాడని తెలిపారు. దీంతో తండ్రి సాయిలు ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Tags:    

Similar News