దసరా ఉత్సవాల్లో ఎమ్మెల్యే జీవన్ రెడ్డి

ఆర్మూర్ పట్టణంలో లోని జాంబీ హనుమాన్ దేవాలయంలో దసరా ఉత్సవాలలో ఎమ్మెల్యే, పీయూసీ చైర్మెన్ జిల్లా అధ్యక్షులు జీవన్ రెడ్డి, ఆయన సతీమణి రజిత రెడ్డి కుటుంబ సభ్యులు పాల్గొని జ్యోతి వెలిగించి దసరా ఉత్సవాలను ప్రారంభించారు.

Update: 2022-10-05 15:15 GMT

దిశ, ఆర్మూర్ : ఆర్మూర్ పట్టణంలోని జాంబీ హనుమాన్ దేవాలయంలో నిర్వహించిన దసరా ఉత్సవాలలో ఎమ్మెల్యే, పీయూసీ చైర్మెన్ జిల్లా అధ్యక్షులు జీవన్ రెడ్డి, ఆయన సతీమణి రజిత రెడ్డి, కుటుంబ సభ్యులు పాల్గొని జ్యోతి వెలిగించి దసరా ఉత్సవాలను ప్రారంభించారు. ఈ ఉత్సవాలను ఆలయకమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. రావణదహనం చేసి విజయదశమి రోజు అందరూ నూతన వస్త్రాలను ధరించి ఉత్సవాలలో పాల్గోన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా ఆనవాయితీ ప్రకారంగా జాంబీహనుమాన్ దేవాలయ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో క్షమీవృక్షానికి పూజలు నిర్వహించారు.

అనంతరం ఆలయ పూజారులు పూజలు చేసి క్షమీచెట్టుకు ఆకులను ఒకరినొకరు ఇచ్చుకుని అలాయి బలాయి చేసుకున్నారు. దసరా పండుగకు ప్రతి సంత్సరం లాగే ఇప్పుడు కూడా జాంబీహానుమాన్ ఆలయ కమీటీ ఉత్సవాలను జరిపి ప్రజలకు ఇబ్బంది కలుగకుండా అన్ని సౌకర్యాలు కల్పించారు. మున్సిపల్ చైర్మెన్ పండిత్ వినిత పవన్, పండిత్, ప్రేమ్, వైస్ చైర్మన్ షేక్ మున్ను, జాంబీహనుమాన్ ఆలయ కమిటీ చైర్మెన్ దేవేందర్, ఆలయ కమిటీ, డైరెక్టర్లు మున్సిపల్ కాన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News