మాకొక ఆధార్ సెంటర్ కావాలి..
ఈ రోజుల్లో ప్రతిదానికి ఆధార్ అవసరమే. ప్రభుత్వ సంక్షేమ పథకాల నుంచి బ్యాంకు ఖాతాల నిర్వహణ వరకు అన్నింటికీ ఆధార్ కార్డు తప్పనిసరి.
దిశ, భీమ్గల్ : ఈ రోజుల్లో ప్రతిదానికి ఆధార్ అవసరమే. ప్రభుత్వ సంక్షేమ పథకాల నుంచి బ్యాంకు ఖాతాల నిర్వహణ వరకు అన్నింటికీ ఆధార్ కార్డు తప్పనిసరి. ఇల్లు, స్థలం కొన్నా చివరకు బైక్ కొనాలన్నా ఆధార్ ఖచ్చితమైపోయింది. అలాంటి ఆధార్ కార్డు కోసం భీమ్గల్ మండలానికి చెందిన ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అందుకు కారణం ఆధార్ కేంద్రం భీమ్గల్ మండల కేంద్రంలో అందుబాటులో లేకపోవడమే.
కొత్త ఆధార్ కావాలన్న, ఆధార్ కార్డ్ లో మార్పులు చేయాలన్న ఆధార్ కేంద్రం తప్పనిసరి. ఆధార్ కేంద్రం మండలంలో ఒక్కటే ఉండడం అది కూడా మండలం కేంద్రం నుండి 5 కిలో మీటర్ల దూరం ఉండడంతో ప్రజలు క్యూలో వేచి ఉండాల్సిన పరిస్థితి. ఆధార్ కోసం పక్క మండలాలకు వెళ్లి దిగుతున్నారు. కొన్ని నెలల క్రితం అందుబాటులో ఉన్న ఆధార్ సెంటర్లు, ఇప్పుడు లేకపోవడంతో ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి ఆధార్ సెంటర్లను ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు.