వ్యాపారులను ఇబ్బంది పెడితే ఊరుకునేది లేదు

వ్యాపారులను అధికారులు ఇబ్బంది పెడితే సహించేది లేదని కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి అన్నారు.

Update: 2024-05-05 15:22 GMT

దిశ, కామారెడ్డి : వ్యాపారులను అధికారులు ఇబ్బంది పెడితే సహించేది లేదని కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి అన్నారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలోని కామారెడ్డి జిల్లా కేంద్రంలో గల రాజారెడ్డి గార్డెన్స్ లో నిర్వహించిన పట్టణ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొని మాట్లాడారు. గత కొంత కాలంగా కామారెడ్డి పట్టణంలో వ్యాపారస్తులను అధికారులు ఇబ్బంది పెడుతు న్నారన్నారు. అలా వ్యాపారస్తులను అధికారులు ఇబ్బంది పెట్టడం సరి కాదన్నారు. నన్ను గెలిపించినందుకు సదా కామారెడ్డి ప్రజల సేవలోనే ఉంటానని, గత ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం అన్ని హామీలు నెరవేరుస్తానన్నారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కామారెడ్డిలో లక్షకి పైగా ఓట్లు వస్తాయని ఆశిస్తున్నానని అన్నారు. సమావేశంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 

Similar News