నూతన జంబీ గద్దె ప్రారంభం

విజయ దశమి సందర్భంగా బుధవారం నూతన జంబీ గద్దెను స్థానిక సర్పంచ్ ఆర్మూర్ పెద్ద బాల్ రాజ్ ప్రారంభం చేశారు.

Update: 2022-10-05 10:50 GMT

దిశ, ధర్పల్లి: విజయ దశమి సందర్భంగా బుధవారం నూతన జంబీ గద్దెను స్థానిక సర్పంచ్ ఆర్మూర్ పెద్ద బాల్ రాజ్ ప్రారంభం చేశారు. ఈ సందర్బంగా సర్పంచ్ మాట్లాడుతూ జంబీ గద్దెను నిర్మించిన గ్రామ అభివృద్ధి కమిటీకి ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. గ్రామ అభివృద్ధి కమిటి ఆధ్వర్యంలో మరెన్నో మంచి కార్యక్రమాలు చెయ్యాలని ఆయన అన్నారు.

ఈ కార్యక్రమానికి అతిధిగా జెడ్పిటీసీ బాజిరెడ్డి జగన్, ఎంపీపీ నల్ల సారిక హన్మంత్ రెడ్డి, సొసైటీ ఛైర్మన్ మల్లికార్జున్ హాజరైయ్యారు. ఈ కార్యక్రమంలో గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు చెలిమెల రంజిత్, దాసరి గంగాధర్, ప్రశాంత్, శిరీష్, రాజేశ్వర్, వెంకటేశ్వర్లు, నల్ల హన్మంత్ రెడ్డి, రాజ్ పాల్, మహిపాల్ యాదవ్, సరేందర్ గౌడ్, గోలేం గంగాదాస్, సుభాష్, ఎస్పీ లింగం, తదితరుల పాల్గొన్నారు.

Tags:    

Similar News