YS షర్మిలకు షాక్.. ఆ కేసులో సమన్లు జారీ చేసిన నాంపల్లి కోర్టు!

పోలీసులపై దాడి కేసులో వైఎస్ఆర్సీపీ తెలంగాణ అధ్యక్షురాలు షర్మిలకు నాంపల్లి కోర్టు సమన్లు జారీ చేసింది.

Update: 2023-06-05 07:57 GMT

దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: పోలీసులపై దాడి కేసులో వైఎస్ఆర్సీపీ తెలంగాణ అధ్యక్షురాలు షర్మిలకు నాంపల్లి కోర్టు సమన్లు జారీ చేసింది. ఈ నెల 20న విచారణకు హాజరు కావాల్సిందిగా పేర్కొంది. కొన్ని రోజుల క్రితం షర్మిల టీఎస్పీఎస్సీ బోర్డు కార్యాలయానికి వెళుతుండగా పోలీసులు లోటస్ పాండ్‌లోని ఆమె నివాసం వద్ద అడ్డుకున్న విషయం తెలిసిందే. అప్పుడు జరిగిన హై డ్రామాలో షర్మిల ఓ మహిళా కానిస్టేబుల్‌పై చెయ్యి చేసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ఆమెను అరెస్ట్ చేసి జైలుకు పంపారు. మరుసటి రోజు షర్మిల బెయిల్‌పై విడుదలై బయటకు వచ్చారు. ఈ కేసులోనే విచారణకు రావాలని నాంపల్లి కోర్టు తాజాగా ఆమెకు సమన్లు జారీ చేసింది.

Tags:    

Similar News