ఓటరు నమోదును సద్వినియోగం చేసుకోండి: కలెక్టర్

అర్హులందరూ ఓటరు నమోదు కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ పాటిల్ హేమంత్ కేశవ్ అన్నారు.

Update: 2022-12-08 16:16 GMT

దిశ, పెన్ పహాడ్: అర్హులందరూ ఓటరు నమోదు కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ పాటిల్ హేమంత్ కేశవ్ అన్నారు. గురువారం మండల పరిధి మాచారం పాఠశాలలో బీఎల్ వీఓ కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఓటు రాజ్యంగం కల్పించిన హక్కు అని తెలిపారు. అనంతరం స్థానిక నర్సరీని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో సంజీవ రావు, తహసీల్దార్ శేషగిరిరావు, ఇంచార్జ్ ఎంపీడీవో బాణాల శ్రీనివాసు, ఎంపీవో నరేష్, అజయ్ నాయక్, రవి, ఆర్ ఐ స్వప్న, సైదులు, చెన్నయ్య తదితరులు పాల్గొన్నారు.

Similar News