ఇంట్లో గంజాయి మెుక్క పెంపకం...50 గ్రాముల గంజాయి స్వాధీనం
సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ పట్టణంలోని దీక్షిత్ నగర్ లోని ఓ ఇంట్లో గంజాయి మొక్క పెంచుతున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసిట్లు హుజూర్నగర్ ఎస్సై కె. వెంకట రెడ్డి తెలిపారు.
దిశ, నేరేడుచర్ల (హుజూర్నగర్) : సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ పట్టణంలోని దీక్షిత్ నగర్ లోని ఓ ఇంట్లో గంజాయి మొక్క పెంచుతున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసిట్లు హుజూర్నగర్ ఎస్సై కె. వెంకట రెడ్డి తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. హుజూర్నగర్ పట్టణంలోని దీక్షిత్ నగర్కు చెందిన బారి నాగరాజు (26) అనే యువకుడు తన ఇంట్లోని పెరట్లో బంతి చెట్లలో గంజాయి మొక్క పెంచుతున్నట్లు గుర్తించామని తెలిపారు. అతని వద్ద నుండి 50 గ్రాముల గంజాయిని స్వాధీనపరుచుకున్నామని పేర్కొన్నారు. నిందితుడు నాగరాజు గతంలో దొంగతనం కేసులో జైలుకు కూడా వెళ్లి వచ్చారని తెలిపారు.