ఈ ఎన్నికల్లో బీజేపీ పార్టీకి గుణపాఠం చెప్పాలి : జానా రెడ్డి

మే 13న జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి కుందూరు రఘువీరా రెడ్డి హస్తం గుర్తుపై ఓటు వేసి బీజేపీ కి గుణపాఠం చెప్పాలని మాజీ మంత్రి, సీఎల్పీ నేత కుందూరు జానారెడ్డి అన్నారు.

Update: 2024-04-30 15:23 GMT

దిశ, పెన్‌పహాడ్: మే 13న జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి కుందూరు రఘువీరా రెడ్డి హస్తం గుర్తుపై ఓటు వేసి బీజేపీ కి గుణపాఠం చెప్పాలని మాజీ మంత్రి, సీఎల్పీ నేత కుందూరు జానారెడ్డి అన్నారు. మంగళవారం మండలం కేంద్రంలోని సత్య గార్డెన్‌లో నిర్వహించిన ముక్యకార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెన్ పహాడ్ మండలం ఏర్పాటుకు తాను కృషి చేస్తానని తెలిపారు. అనంతారం ఎల్ 26 గడ్డిపల్లి ఎల్ 27 లిఫ్ట్ ఇరిగేషన్ ఏర్పాటుకు కృషి చేసానని అన్నారు. అనంతరం మాజీ మంత్రి దామోదర్ రెడ్డి మాట్లాడుతూ పది ఏండ్లు పాలించిన బి ఆర్ ఎస్ బీజేపీ లు ఇచ్చిన హామీలను మరచారన్నారు.

యువతకు అవకాశం ఇవ్వాలని రఘువీర్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. ఈ కార్యక్రమంలో టిపిసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర టూరిజం చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి, జిల్లా డీసీసీ అధ్యక్షుడు చెవిటి వెంకన్న యాదవ్,ఏ ఐ సీసీ సభ్యులకు రాం రెడ్డి సర్వోత్తమ రెడ్డి,మార్కెట్ చైర్మన్ కొప్పుల వేణా రెడ్డి, మాజీ మార్కెట్ చైర్మన్ తూముల భుజంగరావు, మండల అధ్యక్షుడు తూముల సురేష్ రావు, నల్గొండ డి సీసీ అధ్యక్షుడు శంకర్ నాయక్, సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు మామిడి వెంకన్న గౌడ్, యూత్ కాంగ్రెస్ నాయకులు తండు శ్రీనివాస్ యాదవ్, మాజీ జడ్పీటీసీ పిన్నని కోటేశ్వరరావు, మాజీ ఎంపీపీ భూక్యా పద్మ,మండలం ప్రధాన కార్యదర్శి ఆర్తి కేశయ్య తదితరులు పాల్గొన్నారు.

Similar News