మానవీయ కోణాన్ని తట్టి లేపిన స్వామి ఎందరికో స్ఫూర్తిదాయకం: CM KCR

ఫ్లోరోసిస్ నిర్మూలన కోసం తన జీవిత కాలం పోరాడిన అంశాల స్వామి మరణం పట్ల...CM KCR expresses grief over demise of Amshala Swami

Update: 2023-01-28 07:44 GMT

దిశ, మర్రిగూడ: ఫ్లోరోసిస్ నిర్మూలన కోసం తన జీవిత కాలం పోరాడిన అంశాల స్వామి మరణం పట్ల ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు సంతాపం వ్యక్తం చేశారు. నాటి ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ సామాజిక సమస్యగా మారిన ఫ్లోరోసిస్ పేరు గుర్తుకు రాగానే తక్షణమే గుర్తుకు వచ్చిన మరో పేరు అంశాల స్వామి అని సీఎం గుర్తుకు చేసుకున్నారు. మానవీయ కోణాన్ని తట్టి లేపుతూ తెలంగాణ ఉద్యమంలో అంశాల స్వామి చేసిన పోరాటం ఎందరికో స్ఫూర్తిదాయకంగా నిలిచిందన్నారు. స్వరాష్ట్రంలో మిషన్ భగీరథ పథకం ద్వారా, ఫ్లోరోసిస్ రహిత శుద్ది చేసిన స్వచ్ఛమైన తాగునీటిని అందించాలనే దృఢ సంకల్పానికి, ప్లోరోసిస్ బాధితులైన అంశాల స్వామి వంటి వారే ప్రేరణగా నిలిచారని అని సీఎం తెలిపారు. అంశాల స్వామి మరణం బాధాకరమని విచారం వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు సీఎం కేసీఆర్ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

Tags:    

Similar News