తీవ్ర విషాదం.. ఉరేసుకొని తల్లి, కూతురు బలవన్మరణం

మంచిర్యాల జిల్లా మందమర్రిలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. తల్లి, కూతురు బలవన్మరణానికి పాల్పడ్డారు.

Update: 2023-12-27 05:01 GMT

దిశ, వెబ్‌డెస్క్: మంచిర్యాల జిల్లా మందమర్రిలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. తల్లి, కూతురు బలవన్మరణానికి పాల్పడ్డారు. మంగళవారం అర్ధరాత్రి ఇంట్లో ఉరి వేసుకొని తల్లి ధనలక్ష్మి(36), కూతురు జీవని(16) ఆత్మహత్య చేసుకున్నారు. స్థానికులు, కుటుంబ సభ్యుల సమాచారంతో విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. అనంతరం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. కుటుంబ కలహాలే ఆత్మహత్యలకు కారణాలు అయ్యుంటాయని పోలీసులు అనుమానిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Tags:    

Similar News