MLA Rohit Reddy:రెండో రోజు ఈడీ విచారణకు హాజరైన రోహిత్ రెడ్డి

బీఆర్ఎస్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి రెండో రోజు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణకు హాజరయ్యారు.

Update: 2022-12-20 09:54 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: బీఆర్ఎస్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి రెండో రోజు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణకు హాజరయ్యారు. మంగళవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఆయన ఈడీ ఎదుటకు హాజరయ్యారు. నిజానికి ఇవాళ ఉదయం 10:30 గంటలకే విచారణకు హాజరుకావాలని అధికారులు చెప్పినా తాను ఆయప్ప దీక్షలో ఉన్న కారణంగా పూజలు, భిక్ష కార్యక్రమాలు పూర్తి చేసుకుని వచ్చేసరికి ఆలస్యం అయిందని రోహిత్ రెడ్డి తెలిపారు. ఇవాళ విచారణకు బ్యాంకు లావాదేవీల వివరాలతో పాటు బ్యాంకు లాకర్లకు సంబంధించిన వివరాలు తీసుకువచ్చినట్టు తెలుస్తోంది. గత శుక్రవారం ఈడీ నోటీసులు అందుకున్న ఆయన సోమవారం తొలిసారి ఈడీ విచారణను ఎదుర్కొన్నారు. సుమారు ఏడు గంటల పాటు సాగిన విచారణ అనంతం బయటకు వచ్చిన రోహిత్ రెడ్డి.. ఈడీ అధికారులు తనను ఎందుకు పిలిచారో తెలియదని వెల్లడించారు. విచారణకు సహకరిస్తానని అసలు తనను ఏ కేసులో పిలిచారో కూడా తనకు తెలియదని చెప్పారు. తాజాగా రెండో రోజు విచారణలో రోహిత్ రెడ్డి నుంచి ఎలాంటి సమాచారం సేకరించబోతున్నారనేది ఉత్కంఠగా మారింది.

Tags:    

Similar News