Atrocious: రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి
రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి చెందిన సంఘటన కొత్తూరు మున్సిపల్ పరిధిలోని 44వ జాతీయ రహదారి పెంజర్ల కూడలిలో చోటుచేసుకుంది.
దిశ, కొత్తూరు: రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి చెందిన సంఘటన కొత్తూరు మున్సిపల్ పరిధిలోని 44వ జాతీయ రహదారి పెంజర్ల కూడలిలో చోటుచేసుకుంది. హైదరాబాద్ నుండి షాద్నగర్ వైపు వెళుతున్న ద్విచక్ర వాహనాన్ని వెనకాల నుండి వస్తున్న లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు స్థానికులు తెలిపారు.ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న మహిళ అక్కడికక్కడే మృతి చెందింది.
సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని స్తంభించిన ట్రాఫిక్ను నియంత్రించి మృతదేహాన్ని షాద్నగర్ కమ్యూనిటీ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.