ఆ విషయంలో KCR అస్సలు రాజీ పడరు: మంత్రి జగదీష్ రెడ్డి

రాజకీయమే ప్రోటోకాల్.. ప్రోటోకాలే రాజకీయమని మంత్రి జగదీష్‌ రెడ్డి అన్నారు.

Update: 2023-02-03 15:53 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: రాజకీయమే ప్రోటోకాల్.. ప్రోటోకాలే రాజకీయమని మంత్రి జగదీష్‌ రెడ్డి అన్నారు. బడ్జెట్ ప్రసంగంలో గవర్నర్‌‌కు ఇచ్చే ప్రోటోకాల్ కచ్చితంగా ఇస్తామని, అటువంటి విషయాల్లో సీఎం కేసీఆర్ రాజీపడరని అన్నారు. శుక్రవారం అసెంబ్లీ లాబీలో జర్నలిస్టులతో ప్రోటోకాల్‌పై మాట్లాడారు. మొన్నటి వరకు వేరు.. ఇప్పటి వరకు వేరని, గవర్నర్ రాజకీయాలు చేశారు కాబట్టే తాము కూడా రాజకీయాలు చేశామని తెలిపారు. ఇవాళ గవర్నర్ యాదాద్రి టూర్ విషయంలో ఆలయ అధికారులు తగిన ప్రోటోకాల్ ఇచ్చారని అన్నారు. పెండింగ్ బిల్లుల అంశం గవర్నర్‌కే తెలియాలని, వాటిపై ఆమె క్లారిటీ ఇవ్వాలన్నారు.

Similar News