తెలంగాణలో తాము గెలిచే సీట్లు ఇవే.. మంత్రి సీతక్క జోస్యం

పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో గెలిచే స్థానాలపై మంత్రి సీతక్క కీలక వ్యాఖ్యలు చేశారు.

Update: 2024-05-04 06:36 GMT

దిశ, వెబ్‌డెస్క్: పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో గెలిచే స్థానాలపై మంత్రి సీతక్క కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ లో అసమ్మతికి చోటు లేదని స్పష్టం చేశారు. పాత నేతల ఘర్ వాపసీ తాత్కాలికంగా నిలిపివేశామన్నారు. ఎంపీ ఎన్నికల్లో సమన్వయంతో ముందుకు సాగుతామని తెలిపారు. బీజేపీ పాలనలో ఏ ట్యాక్స్ పాలన సాగిందని ఎద్దేవా చేశారు. అదానీ, అంబానీ పాలనకు చరమగీతం పాడుతామన్నారు. దేశంలో మార్పు మొదలైందని.. ఇండియా కూటమి అధికారంలోకి రాబోతోందన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో 15 సీట్లు గెలుస్తామన్నారు. 

Similar News