‘తెలంగాణలో అభ్యర్థులను అప్పుడే ప్రకటిస్తాం’

కేంద్రంలోని బీజేపీ సర్కార్‌పై ఎమ్ఐఎమ్ పార్టీ చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు చేశారు.

Update: 2023-04-25 04:22 GMT

దిశ, వెబ్‌డెస్క్: కేంద్రంలోని బీజేపీ సర్కార్‌పై ఎమ్ఐఎమ్ పార్టీ చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ స్టీరింగ్ ఆర్ఎస్ఎస్ చేతిలో ఉన్నదని వ్యాఖ్యానించారు. మతాల పేరుతో తెలంగాణ ప్రశాంతతను దెబ్బతీయాలని చూస్తున్నారని మండిపడ్డారు. అంతేగాక, కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్ఐఎమ్ మూడు నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. తెలంగాణలో సమయం వచ్చినప్పుడు అభ్యర్థులను ప్రకటిస్తామని తెలిపారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా రాష్ట్ర వ్యాప్తంగా బూత్ లెవెల్ కమిటీలు ఏర్పాటు చేయబోతున్నామని అన్నారు.

Tags:    

Similar News