రూ. 25.5 లక్షల నగదు సీజ్..
సరియైన పత్రాలు లేకుండా నగదును తరలిస్తున్న వాహనాన్ని
దిశ, కూకట్పల్లి: సరియైన పత్రాలు లేకుండా నగదును తరలిస్తున్న వాహనాన్ని బాలానగర్ ఎస్ఓటి, కేపీహెచ్బీ లా అండ్ ఆర్డర్ పోలీసులు శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. అందులో తరలిస్తున్న రూ. 25,50,000 నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్ పరిధిలోని జేఎన్టీయూ కూడలిలో వాహనాలు తనిఖీ చేస్తుండగా టీఎస్09యూడీ 2154 నెంబరు గల పీవీఎస్ క్యాష్ లాజిస్టిక్స్కు చెందిన వాహనంలో రూ. 25,50,000 నగదును మూడు బాక్సులలో తరలిస్తున్నారు. ఇదిలా ఉండగా ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం ఎటువంటి ధృవీకరణ పత్రాలు, క్యూఆర్ కోడ్, ఎటువంటి అనుమతి పత్రాలు లేకుండా నగదును తరలిస్తున్నందుకు పోలీసులు నగదును స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు.