కాంగ్రెస్ వచ్చింది.. రాష్ట్రమంతా కరువు వచ్చింది : మల్లారెడ్డి

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది రాష్ట్రమంతా కరువు వచ్చిందని

Update: 2024-05-10 16:30 GMT

దిశ,మేడిపల్లి: కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది రాష్ట్రమంతా కరువు వచ్చిందని ఎమ్మెల్యే మల్లారెడ్డి అన్నారు, ఈ సందర్భంగా బోడుప్పల్ బీఆర్ఎస్ అధ్యక్షుడు మంద సంజీవరెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్ లో ఎమ్మెల్యే మల్లారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రాష్ట్రమంతా కరువు వచ్చిందని, రేవంత్ రెడ్డి దేవుని తోడని అబద్దపు ప్రమాణాలు చేయడం తోనే ఇలా కరువు వచ్చిందని అన్నారు. ఇచ్చిన హామీలలో ఒక్కటి కూడా అమలు చేయలేదని, బోడుప్పల్ లో వక్స్ బోర్డు సమస్య, ఎస్సీలకు ఇచ్చిన భూ సమస్య 6 నెలలో తేల్చకుంటే తానే దీక్ష లో కూర్చుని సీఎం తో మాట్లాడి వారి సమస్యను పరిష్కరిస్తారని అన్నారు.రాగిడి లక్ష్మారెడ్డి ని భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ సందర్భంగా కార్యకర్తలు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా మల్లారెడ్డి అందరిని ఉర్రుతలూగించారు.ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు మంద సంజీవ రెడ్డి, కార్యదర్శి మీసాల కృష్ణ, బోడుప్పల్ మేయర్, కార్పొరేటర్లు కాలనీ అధ్యక్షుడు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !


Similar News