ఆన్లైన్లో బుక్ చేసుకున్న మ్యాచ్ టికెట్లు నేటి నుంచే
దిశ: కంటోన్మెంట్/బోయిన్ పల్లి : భారత్, ఆస్ట్రేలియా మ్యాచ్ టికెట్లు కోసం ఆన్ లైన్లో టికెట్లు బుక్ చేసుకున్న Latest Telugu News
దిశ: కంటోన్మెంట్/బోయిన్ పల్లి : భారత్, ఆస్ట్రేలియా మ్యాచ్ టికెట్లు కోసం ఆన్ లైన్లో బుక్ చేసుకున్న వారికి నేటి నుంచి ఈ నెల 25 వరకు ఇవ్వనున్నారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జింఖానా గ్రౌండ్స్లో ఫిజికల్గా టికెట్లు ఇస్తామని హెచ్ సీఏ ప్రతినిధులు నిర్ధారించారు. టికెట్ల కోసం వెళ్లిన ప్రేక్షకులు ఈ - మెయిల్ నిర్ధారణ లేదా ప్రభుత్వం ఆమోదించిన ఐడీ రుజువు తప్పనిసరిగా చూపించాలని, ఫోటో కాపీని కౌంటర్లో సమర్పించి టికెట్ తీసుకోవాలని హెచ్సీఎ తెలిపారు.
ఆఫ్ లైన్ టికెట్లు జింఖానా గ్రౌండ్స్లో అందుబాటులో లేవని, ఆఫ్ లైన్ టికెట్ల కోసం వచ్చే వారికి అనుమతి నిరాకరించారు. ముందస్తుగా ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా అడిషనల్ సీపీ చౌహన్ ఆధ్వర్యంలో పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేస్తూ.. మానిటర్ చేస్తున్నారు. అడిషనల్ సీపీ చౌహన్ తో పాటు, జాయింట్ సీపీ కార్తికేయ, నార్త్ జోన్ డీసీపీ చందనా దీప్తి, అడిషనల్ డీసీపీ వెంకటేశ్వర్లు, టాస్క్ ఫోర్స్ డీసీసీ రాధాకిషన్ రావు, ఏసీపీలు, సీఐలు,టాస్క్ ఫోర్స్ టీం , ఎఆర్ టీంలు జింఖాన గ్రౌండ్లో బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఇదంతా ముందస్తులో భాగమే అని అడిషనల్ సీపీ చౌహన్ తెలిపారు.