అభివృద్ధికి ఆకర్షితులవుతున్నారు
దేశంలో ప్రధాని మోదీ ఆధ్వర్యంలో జరిగిన అభివృద్ధికి అందరూ ఆకర్షితులవుతున్నారని మల్కాజిగిరి ఎంపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ అన్నారు.
దిశ, కూకట్పల్లి : దేశంలో ప్రధాని మోదీ ఆధ్వర్యంలో జరిగిన అభివృద్ధికి అందరూ ఆకర్షితులవుతున్నారని మల్కాజిగిరి ఎంపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ అన్నారు. కూకట్పల్లి నియోజకవర్గం పరిధిలోని మైత్రినగర్లో ఈటెల రాజేందర్ శనివారం నియోజకవర్గం ఇన్చార్జి మాధవరం కాంతారావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వడ్డేపల్లి రాజేశ్వర్ రావుతో కలిసి పర్యటించారు. బీజేపీ నాయకులు యంజాల పద్మయ్య ఆధ్వర్యంలో పలువురు బీఆర్ఎస్ నాయకులు ఈటెల రాజేందర్ సమక్షంలో బీజేపీలో చేరారు.
పార్టీలో చేరిన వారికి ఈటల రాజేందర్ బీజేపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఈటెల రాజేందర్ మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై చాలా మంది స్వచ్ఛందంగా పార్టీలో చేరుతున్నారని అన్నారు. రోజురోజుకూ బీజేపీకి ప్రజల మద్దతు పెరుగుతుందని అన్నారు. లోక్ సభ ఎన్నికల్లో మల్కాజిగిరి పార్లమెంట్లో బీజేపీ జెండా ఎగురుతుందని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ పార్టీలో చేరిన వారిలో మణీందర్ రెడ్డి, రమేష్ రెడ్డి, కవిత, సరిత, స్వాతి, సౌజన్య, సుజాత, విజయ్, లక్ష్మి నారాయణ్ రెడ్డి, లీలా శంకర్, సురేష్, రంగారెడ్డి, సాగర్ తదితరులు ఉన్నారు.