బిగ్ బ్రేకింగ్ న్యూస్.... రూ. 400 లకే కిలో మటన్

రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా 400 రూపాయలకే కిలో మటన్ అమ్మడంతో మటన్ షాప్ వద్దకు వందల సంఖ్యలో మాంసం ప్రియులు తరలివచ్చారు.....Kilo Mutton for Rs. 400

Update: 2022-09-25 05:44 GMT

దిశ, దుబ్బాక: రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా 400 రూపాయలకే కిలో మటన్ అమ్మడంతో మటన్ షాప్ వద్దకు వందల సంఖ్యలో మాంసం ప్రియులు తరలివచ్చారు. ఉదయం మూడు గంటల నుండే పెద్ద సంఖ్యలో మటన్ దుకాణాల వద్దకు ప్రజలు భారీగా తరలి రావడంతో పోలీసులు బందోబస్తు నిర్వహించాల్సిన పరిస్థితి నెలకొంది.


సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం అక్బర్ పేట గ్రామంలో రూ. 400 రూపాయలకే మటన్ దుకాణదారులు పోటాపోటీగా గత నెల రోజుల నుండి మాంసాన్ని విక్రయించడం జరుగుతుంది. నేడు ఆదివారంతోపాటు పెద్దల అమావాస్య కావడంతో మటన్ కోసం వందల సంఖ్యలో దుకాణాల వద్దకు వివిధ మండలాల నుంచి తరలివచ్చారు. మటన్ తీసుకోవాలంటే సుమారు రెండు నుంచి మూడు గంటల పాటు క్యూ కట్టాల్సిన పరిస్థితి నెలకొంది. ఒకానొక సమయంలో మటన్ దుకాణం వద్ద తోపులాట చోటుచేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని మటన్ దుకాణాల వద్ద ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా బందోబస్తు నిర్వహించారు. దుకాణదారుల మధ్య పోటీ వినియోగదారులకు కలిసి వచ్చిందంటూ మటన్ ప్రియులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇంత పెద్ద సంఖ్యలో వివిధ మండలాల నుండి మటన్ కోసం ప్రజలు తరలిరావడంతో దుకాణదారులకు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.



Similar News